డీఎస్సీపై హైకోర్టు కీలక తీర్పు
ఏపిలో 16347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ సైతం విడుదలయ్యాయి. కాగా ఈ మెగా డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించి పరీక్షలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.