రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణలో జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పలువురు మంత్రులు, సలహాదారులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్,ల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి.