పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటివరకు అధికారకంగా ప్రకటించలేదు. కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా వారికి గుడ్ న్యూస్ అందించింది. జులై నెలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ముందుగా MPTC,ZPTC, ఎన్నికలు నిర్వహించి తరువాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం పేర్కొంది.