రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్
రేషన్ కార్డు దారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈనెల చివరి వరకు రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటన చేశారు. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సరుకులు సరఫరా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 62 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తయిందని తెలిపారు.