అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది. ఈడీ ద్వారా జప్తు చేయబడిన అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు పంపిణీ చేసేందుకు కోర్టు అనుమతించింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 6 వేల కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఏపీ, తెలంగాణ, కర్ణాటకఒడిషా రాష్ట్రాల్లో కలిపి 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నట్లు ఈడీ తేల్చింది. ఇప్పటికే ఈ స్కాం లో 33 మందిపై ఈడీ కేసు నమోదు చేసింది. వారి ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆస్తులను పంపిణీ చేయనుంది.