సెలవులకు ఇంటికి వస్తే.. బలవంతంగా పెళ్లి చేసేశారు
ఏపీలోని తిరుపతి జిల్లా కోటలో దారుణ ఘటన వెలుగుచూసింది. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఏడో తరగతి చదువుతున్న కూతురికి పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేసేశారు. భర్తతో కాపురం చేయాల్సిందేనని, తనను కన్నవాళ్లు వేధిస్తున్నారని ఆ బాలిక టీచర్ల వద్ద బోరున ఏడ్చింది. దాంతో వారు పోలీసులతో పాటు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.