కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయనతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియలేదు.
ఈ ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు.