రైలు కింద పడి ఐదుగురు మృతి
హరియాణాలోని ఫరీదాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన తగాదం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ మేరకు భర్త మనోజ్, భార్య ప్రియాకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన మనోజ్ నలుగురు పిల్లల్ని పార్కుకు తీసుకెళ్తానని చెప్పి వారిని బయటికి తీసుకెళ్లాడు. చిన్నారులు కోరిన కూల్ డ్రింక్స్ కొనించి తరువాత పట్టాలపై వేగంగా వస్తున్న రైలు కింద నలుగురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.