Breaking: ఏపిలో రైలులో మంటలు
శ్రీ సత్యసాయి జిల్లాలో తిరుపతి - సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ (12769) కు ఘోర ప్రమాదం తప్పింది. ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ బోగీ చక్రం వద్ద రాపిడితో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో మంటలను ప్రయాణికులు గుర్తించి ఒక్కసారిగా కేకలు వేయడంతో గార్డు గమనించి లోకో పైలెట్ను అప్రమత్తం చేశాడు. దీంతో రైలును లోకో పైలట్ నిలివేశాడు. అనంతరం మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.