నదిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు

News Published On : Monday, May 26, 2025 05:53 PM

ఏపీలోని ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలోకి దిగారు లోతైన ప్రాంతం కావడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా.. ముగ్గురు సురక్షితంగా బయటికి వచ్చారు. గల్లంతైన వారు కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన వారిగా గుర్తించారు.