ఇలాంటి మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త..!
అమాయకులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశల వలవేసి యథేచ్ఛగా బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా SBI రివార్డ్ పాయింట్స్ అంటూ ఏపీకే ఫైల్ (APP) డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఎస్బీఐ రివార్డు పాయింట్స్ రీడీమ్ చేసుకోవచ్చంటూ సందేశాలు పంపిస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ 'ఎక్స్'లో పోస్టు పెట్టింది. అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.