పంటల కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

News Published On : Wednesday, May 28, 2025 03:25 PM

ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ తాజాగా ముగిసింది. ఈ కేబినెట్ లో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కనీసం మద్దతు ధర కోసం కేంద్రం రూ.రెండు లక్షల 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి పై 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.