ఏపీలో 534 ఉద్యోగాల భర్తీకి కేంద్రం చర్యలు
ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు చేపట్టింది. మొత్తం 534 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులకు స్పందించిన ఆర్థికశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుల భర్తీకి సహకరించిన నిర్మలాసీతారామన్, జేపీ నడ్డాకు మంత్రి పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నారు.