కూలిన వంతెన.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయని నది పైన ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 25 మంది గల్లంతైనట్లు స్థానిక ఎమ్మెల్యే సునిల్ షుల్క్ తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.