BREAKING : ఆంధ్రప్రదేశ్ లో మరో 14 కరోనా కేసులు నమోదు.
ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు వాట్సాప్ ద్వారా వెల్లడించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన బాధితుల సంఖ్య 58కి చేరుకుంది. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వైద్యపరీక్షల్లో 14 పాజిటివ్, 10 నెగిటివ్, ఇంకా 6 నివేదికలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ కరోనా పాజిటివ్ కేసులను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ధ్రువీకరించాల్సిఉంది. వీరిలో చాలామంది ఢిల్లీ మతప్రచారానికి వెళ్లి వచ్చినవారు ఉన్నారు.