వంతెన కూలిన ఘటన: మృతదేహాల వెలికితీత
మహారాష్ట్రలో పురాతనమైన ఇంద్రాయణి నదీ వంతెన కూలి ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో 51 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు మహారాష్ట్ర సీఎం వెల్లడించారు.