ఉగ్రదాడి ఎఫెక్ట్: ఆగిన రాకపోకలు
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇప్పటికే భారత్ లో ఉన్న పాకిస్థానీయులు ఏప్రిల్ 30 తో దేశాన్ని విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. నిన్నటికే ఆ గడువు ముగియడంతో పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లోని అటారీ - వాఘా సరిహద్దును అధికారులు తాజాగా మూసివేశారు. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.