ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ ట్యాబ్ లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని వారికి ట్యాబ్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెల్లూరులో మెప్మా మహిళలు, అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సభ్యులకు 9000 ట్యాబ్ లు అందించనున్నట్లుగా వెల్లడించారు.