రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం
ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలా ఏపీ ప్రభుత్వం కీలక అడుగువేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో AWARE ప్లాట్ఫామ్ ను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ఇది ప్రణాళిక తదితర విభాగాల్లో 42కి పైగా అప్లికేషన్లలో పనిచేయనుంది.