ఏపీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పాలసీ.. మార్గదర్శకాలు జారీ
ఏపీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పాలసీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. రూ.4.2లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి లక్ష్యంగా పాలసీకి రూపకల్పన చేసింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి యూనిట్లకు వందశాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. ఒక్కో ఉద్యోగికి రూ.4వేల నుంచి 6వేల వరకు ఐదేళ్లపాటు ప్రోత్సాహకం, ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఐదేళ్లు యూనిట్ విద్యుత్ రూ.1కే ఇవ్వనున్నట్లు పేర్కొంది.