Breaking: కేటీఆర్కు నోటీసులు
హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగానే కేటీఆర్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.