మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టుకి వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి అక్రమ వసూళ్లకి పాల్పడ్డారని ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే మైనింగ్ కేసులో మూడు రోజుల పాటు కాకాణిని రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో విచారణ చేసిన సంగతి తెలిసిందే.