ఆపరేషన్ సిందూర్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయన్నారు. వాళ్ల సమాచారం, నిఘా నెట్వర్క్ ను కూల్చివేశాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. BSF కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు.