రాజ్యసభకు ఆ మంత్రి- నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నేతలు హ్యాపీ- ఎందుకంటే !

News Published On : Friday, March 20, 2020 09:56 AM

సొంత పార్టీ వైసీపీతో పాటు ప్రత్యర్ది పార్టీ టీడీపీలో నేతలు కూడా ఆయన పేరు చెబితేనే మండిపడుతుంటారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఆయనకు రెవెన్యూ మంత్రి కమ్ డిప్యూటీ సీఎం పదవులు దక్కడం ఆయన ప్రత్యర్ధులకు రుచించడం లేదు. కానీ తాజాగా మండలి రద్దు నేపథ్యంలో ఆయన్ను రాజ్యసభకు పంపాలన్న సీఎం జగన్ నిర్ణయం తిరిగి వారిలో సంతోషం నింపుతోంది.పేరుకు వైసీపీలో చేరారనే కానీ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో మాత్రం బోస్ తన పునర్ వైభవాన్ని కోల్పోయారు.