ఎయిరిండియా మరో కీలక ప్రకటన
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ఎయిరిండియా వారి తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు గాను రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. టాటా గ్రూపు ప్రకటించిన రూ. కోటి పరిహారానికి ఇది అదనమని పేర్కొంది.