కాలేజీ మీద కూలిన విమానం.. 20 మంది విద్యార్థులు మృతి
అహ్మదాబాద్లో మేఘానిలో కూలిన ఎయిర్ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలింది. ఆ ఘటనలో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందారు. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలింది. విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వాసులు, విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు.
ప్రమాదస్థలిలో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఎయిరిండియా హెల్ప్లైన్ నెంబర్ 1800 5691 444 ను విమాన ప్రమాద విచారణ కోసం ప్రకటించింది.