టాటా చరిత్రలో చీకటి రోజు
అహ్మదాబాద్ విమానఘటన పై టాటా సంస్థ మరోసారి స్పందించింది. తమకు ఇది కష్టమైన సమయమే అయినప్పటికీ బాధ్యతల విషయంలో వెనక్కి తగ్గమని ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ ఛైర్మెన్ నటరాజన్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సంస్థ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని వెల్లడించారు. విమాన ప్రమాదం దర్యాప్తులో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ తీసుకున్న సంగతి తెలిసిందే.