మందుబాబులకు ఇక కష్టాలే...

News Published On : Tuesday, December 4, 2018 11:48 AM

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండురోజుల పాటు గ్రేటర్‌లో మద్యం అమ్మకాలను నిలిపివేయనున్నట్టు ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది. ప్రచారం ముగిసే బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా ఈ నిషేధం అమలులో ఉంటుందని ఆ శాఖఅధికారులు ప్రకటించారు. తిరిగి ఓట్ల లెక్కిపు రోజు.. ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ వరకు మద్యం అమ్మకాలు ఉండవని పేర్కొన్నారు.