ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం

News Published On : Saturday, December 15, 2018 12:56 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్‌ మరొక అవకాశం కల్పించింది. జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ సేవా, నెట్‌ సెంటర్‌, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటు నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. నమోదుకు గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన డిగ్రీ నకలు, నివాస ధ్రువీకరణ ఆధారం వినియోగంలో ఉన్న సెల్‌ నెంబర్‌ ఉండాలి.