ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా..!
కుటుంభంలో ఒకరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కుటుంభం మొత్తం ఇబందిపడుతుంది. వివరాలలోకి వెళితే రాజస్థాన్లోని జైపూర్లో ఓ కుటుంబంలోని 11 మందికి కరోనా సోకింది. రామ్గంజ్కు చెందిన ఓ వ్యాపారి మార్చి 12న ఒమన్ నుంచి తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచి సొంతూరు చేరుకున్న మరునాడు స్నేహితుడితో మార్కెట్ వద్ద కొంతసేపుగడిపారు. సుమారు ఆ ఊరిలో 53 మందిని కలిశారు. పక్షం రోజుల తర్వాత ఆ వ్యాపారి, మిత్రుడు, మిత్రుడి కుటుంబంలోని పది మందికి కలిపి మొత్తంగా 12 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మరింత మందికి వైరస్ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్న అధికారులు ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 409 కొత్త కేసులు నమోదయ్యాయని , 7 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క తమిళనాడులోనే 110 కొత్త కేసులు నమోదయ్యాయి కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1870 కాగా మరణాల సంఖ్య 56 గా ఉంది.