టొమాటో గుజ్జు ముఖంపై వాడటం వలన కలిగే ఫలితాలు
టొమాటో వాడటం వలన మొటిమలు, కురుపులు వంటి వాటిని నయం చేస్తుంది. తాజా టొమాటోలను బ్లెండర్ లో వేసి గుజ్జులా చేయాలి. ఈ టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడగాలి . రోజూ ఇలా చేస్తే చర్మంపై పెద్దగా కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు మచ్చలు తగ్గించేందుకు టొమాటో గుజ్జు చాలా బాగా పనిచేస్తుంది.
ఒక టేబుల్స్పూన్ పసుపులో సరిపడా పాలు పోసి పేస్ట్లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మచ్చలు కూడా మటుమాయం అవుతాయి. పొడిబారిన చర్మానికి ఒక టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల గంధం పొడి, సరిపడా నీళ్లు (రోజ్ వాటర్ అయినా వాడొచ్చు) కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే బాగుంటుంది.
పుదీనాలో ఉండే మెంథాల్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు తొలగించుకోవాలంటే తాజా పుదీనా రసాన్ని ప్రతిరోజూ రాత్రి సమయంలో ముఖానికి రాసుకోవాలి.పుదీనా ఆకుల్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి. వారంలో కొన్నిసార్లు ఇలా చేస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. చర్మానికి సంబంధించిన పలు రకాల సమస్యలను నయం చేసేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇత ఆ తర్వాత…