మహేష్ తో సినిమా చేయడానికి విజయశాంతి ఒప్పుకోవడానికి కారణం తెలుసా?

Entertainment Published On : Wednesday, June 19, 2019 10:41 AM

మహేష్ బాబు మహర్షి సినిమా తరవాత సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ తో మే 31 వ తేదీన మహేష్ కొత్త సినిమా సెట్స్ మీదకి వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నది. విజయశాంతి అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావించిన అనిల్, నిర్మాత దిల్ రాజు అనుకున్నారు. ఇక విజయశాంతి గత 13 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీ అయ్యారు. తెలంగాణకు చెందిన మహిళ కావడంతో దిల్ రాజు అడిగితె కాదనదేమో అని రాజు ద్వారా ఆమెని అప్ప్రోచ్ అయ్యారు. పాత్ర కీలకం కావడంతో ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు కూడా. అనుకున్నట్టుగానే ఆమె అడిగినంత ముట్టజెప్పారని సమాచారం.

ఈ డీల్ కి ఆమె ఒకే చెప్పింది. మహేష్ తో సినిమా చేయడం హ్యాపీగా ఉందని విజయశాంతి పేర్కొంది. చాలాకాలం తరువాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నది కాబట్టి ఫిట్నెస్ కోసం ప్రతిరోజూ కసరత్తులు మొదలు పెట్టింది. ఈ సినిమా కోసం మళ్ళీ విజయశాంతి తన లుక్ ను మార్చుకోబోతున్నది. ఈ సినిమా తరువాత ఆమెకు వరసగా ఆఫర్లు వస్తాయి అని డైరెక్టర్ అన్నారు. విజయశాంతి సినిమాల్లోకి తిరిగి అడుగుపెట్టింది అనే విషయం తెలిసిన చాలామంది దర్శక నిర్మాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరో కొన్ని పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.