నాకెందుకీ పరీక్ష స్వామీ.. మంచు విష్ణు ఆవేదన
మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా భావోధ్వేగ పోస్టు పెట్టారు. 'కన్నప్ప' మూవీలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ కావడంతో ఆవేదన చెందాడు. 'జటాజూఠధారీ, నీకోసం తపస్సుచేసే నాకెందుకీ పరీక్ష స్వామీ?' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అది వైరలవుతోంది.ఒకవేళ ఆ హార్డ్ డ్రైవ్లోని సమాచారం బయటకు వస్తే ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.