విమాన ప్రమాదం: కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుండగా, ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కానీ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే, అహమదాబాద్లో లండన్ వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 230 మందికి పైగా మరణించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ రేపు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా లేక మరో రోజు ఈవెంట్ కండక్ట్ చేసి రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కూడా ఈ రోజే జరగాల్సి ఉంది. ఈ మేరకు అక్షయ్ కుమార్, మంచు విష్ణు కలిసి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. విమాన ప్రమాద నేపథ్యంలో ఆ ఈవెంట్ ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది.