ఇకపై డబ్బులిచ్చి వ్యూస్ కొనడం ఆపేస్తా: దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న కొన్ని విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, సినిమాల ప్రచారంలో యూట్యూబ్ వ్యూస్ ను కృత్రిమంగా పెంచుకునే పద్ధతిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇకపై తమ బ్యానర్లో నిర్మించే సినిమాలకు డబ్బులు ఖర్చు చేసి ఫేక్ యూట్యూబ్ వ్యూస్ కొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న "తమ్ముడు" సినిమా నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.