అబ్దుల్ కలాం బయోపిక్ లో ధనుష్
మాజీ రాష్ట్రపతి,మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా A.P.J అబ్దుల్ కలాం జీవితం తెరపైకి రానుంది. 'కలాం' టైటిల్ తో ఆయన బయోపిక్ ను 'ఆదిపురుష్' ఫ్రేమ్ ఓం రౌత్ తీసుకొస్తున్నారు. కలాం పాత్రలో ధనుష్ నటించనున్నారు. ఈ మేరకు 'క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' లో ఈ సినిమాను ప్రకటిస్తూ చిత్ర బృందం పోస్టర్ ను విడుదల చేసింది. అభిషేక్ అగర్వాల్,అనిల్ సుంకర,భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.