ఉగ్రదాడి వ్యాఖ్యలు.. సింగర్ పై కేసు నమోదు
బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ పై కేసు నమోదు అయ్యింది. బెంగళూరులో జరిగిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్ కన్నడ పాట పాడటానికి నిరాకరించాడు. ఆడియన్స్ డిమాండ్ ను పహల్గామ్ ఉగ్రవాద దాడితో పోల్చాడు. సింగర్ తీరుపై కర్ణాటక రక్షణ వేదికే (KRV) తీవ్రంగా స్పందించింది. కన్నడిగుల మనోభావాలను ఆయన దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో BNSలోని పలు సెక్షన్ల కింద సోను నిగమ్ పై కేసు నమోదు చేశారు.