రిలేషన్ షిప్ వద్దన్న యువతి.. OYO రూమ్ లో పొడిచి చంపిన బాయ్ ఫ్రెండ్
బెంగళూరులోని ఓయో హోటల్ రూమ్ లో ఓ యువతి బాయ్ ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది. డీసీపీ లోకేశ్ బి జగలాసర్ వివరాల మేరకు జూన్ 5 నుండి 7వ తేదీ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. హరిణి అనే యువతి యషాస్ అనే యువకుడితో రిలేషన్ లో ఉంది. హరిణి తమ సంబంధాన్ని తొలగించుకుందామని అనుకుంది. అతడిని దూరం పెట్టేందుకు యత్నించింది. దీంతో తీవ్ర ఆగ్రహం, అసూయకు గురైన యషాస్ ఆమెను ఓయో రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ దారుణంగా పొడిచి హత్య చేశాడు.