నగ్నంగా పూజలు చేస్తేనే సినీస్టార్ అవుతారు, యువతికి దొంగ బాబా కహానీ, ఆతరువాత..!

Crime Published On : Thursday, March 19, 2020 01:56 PM

దొంగ బాబాలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయకుల బలహీనతే పెట్టుబడిగా రెచ్చిపోతున్నారు. ముక్కుపిండీ డబ్బులు వసూల్ చేయడమే కాదు. నగ్నంగా పూజలు చేయాలని కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున గల భవానీపురంలో రాత్రికి రాత్రే దొంగబాబా అచ్చిరెడ్డి వెలిశాడు. తన ఇంటి వద్దే కార్యాలయం ఏర్పాటు చేసి. అమాయకులకు వల వేస్తున్నాడు. అతనివలలో చిక్కిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే విజయవాడ భవానీపురంలో అచ్చిరెడ్డి అలియాస్ బాబా ఉంటున్నాడు. తన ఇంటి వద్దే అమాయకులను బురిడీ కొట్టించే దొంగ బాబా కార్యాలయం తెరిచాడు. ఇలా అచ్చిరెడ్డి వలలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి చిక్కింది. ఆమెను మాటల్లో పెట్టిన అచ్చిరెడ్డి. తొలుత రూ. లక్ష వసూల్ చేశాడు. తర్వాత దైవభక్తికి సంబంధించిన యూ ట్యూబ్ చానెల్ ఉందని. అందులో షేర్ ఇస్తానని నమ్మబలికాడు. ఒకటి కాదు రెండు కాదు రూ. 18 లక్షలు గుంజాడు.