నాగర్‌కర్నూలులో దారుణానికి తెగబడ్డ మరో స్వాతి, ప్రియుడితో కలిసి భర్త హత్య,

Crime Published On : Thursday, March 5, 2020 02:10 PM

మూడేళ్ల క్రితం నాగర్‌కర్నూలు జిల్లాలో స్వాతి అనే వివాహిత ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా స్వాతి అనే మరో వివాహిత ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన ఘటన జిల్లాలోని తాడూరు మండలం పర్వతాయిపల్లిలో వెలుగుచూసింది. మొదట తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరించిన నిందితురాలు, ఆ తర్వాత తానే భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది.పర్వతాయిపల్లికి చెందిన దాసరి యాదయ్య(35)కి కొన్నేళ్ల క్రితం భాగ్యమ్మ అనే మహిళతో వివాహం జరిగింది