భార్య గొడవపడి పుట్టింటికి.. పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి హత్య
భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో తనకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని ఓ భర్త కత్తితో పొడిచి చంపాడు. కర్ణాటకలోని మంగుళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగుళూరుకు చెందిన సులేమాన్ అనే మధ్యవర్తి 8 నెలల క్రితం ముస్తఫాకు ఓ మహిళతో పెళ్లి కుదుర్చాడు.
అయితే 2 నెలల క్రితం భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోవడంతో ఆగ్రహానికి గురైన ముస్తఫా మధ్యవర్తి సులేమాన్ ను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు.