అనుమానంతో భర్త మర్మాంగాన్ని తెగ్గోసిన భార్య!

Crime Published On : Thursday, January 24, 2019 12:29 PM

అనుమానంతో భర్తలు భార్యలను చంపుతున్న సంఘటనలు ఎన్నో విన్నాం... కానీ భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడనే అనుమానంతో భార్య అతడి మర్మాయవాలను కోసేసిన ఉదంతం ఒడిశాలో చోటు చేసుకుంది. 

ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లా తెంతులికుంటి సమితిలోని ఉదయపూర్‌ గ్రామానికి చెందిన ఓ దంపతులు సమీపంలో ఇటుక బట్టీ పనులకు దినసరి కూళీలుగా వెల్లేవారు. అయితే, భర్త గత కొంత కాలంగా పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండటాన్ని భార్య అనుమానించింది. అనుకున్నట్లుగానే తన భర్త మహిళను తనకు తెలియకుండా రహస్యంగా కలుస్తూ... అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని నిర్ధారించుకుంది. భర్త గాఢ నిద్రలో ఉండటాన్ని అదునుగా భావించి అతని కాళ్లు చేతులు కట్టేసి మర్మాంగాన్ని కోసేసింది. అతడి ఆక్రందనలు విన్న ఇరుగు పొరుగు వారు అక్కడి చేరుకుని సమీపంలోని ఆసుపత్రి తరలించారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 90 శాతం తెగిపోయిన గాయాలతో అతడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.