రీల్స్ చేస్తూ ఆరుగురు అమ్మాయిలు మృతి
ఇన్ స్టా రీల్స్ పిచ్చిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యమునా నదిలో రీల్స్ తీసుకోవడానికి ఆరుగురు అమ్మాయిలు అక్కడికి వెళ్లారు. నీటిలో ప్రమాదవశాత్తు ఓ యువతి కాలుజారి అందులో పడిపోయింది.
తనని రక్షించడానికి మిగతా ఐదుగురు ప్రయత్నించి అదే నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.