ఒకే కుటుంబంలో ఏడుగురు అనుమానాస్పద మృతి
హర్యానాలో పంచకులలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ మేరకు పార్క్ చేసిన కారులో ఏడు మృత దేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హర్యానాలోని వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబంగా అధికారులు గుర్తించారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.