Breaking: సాక్షి కార్యాలయానికి నిప్పు
ఏలూరులోని సాక్షి కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు కాలిపోయాయి. ఆఫీసు ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు. ఇది టీడీపీ నేతల పనే అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, ర్యాలీగా వెళ్తుంటే తమపై నిందలు మోపుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇటీవల సాక్షి టీవీ టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.