కరోనా అనుమానం, నిర్దాక్షిణ్యంగా భార్యను బాత్రూమ్లో,
ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తితో తాను మాట్లాడానని, అప్పటినుంచి కరోనా సోకినట్టుగా అనిపిస్తోందని ఆ మహిళ తన భర్తతో వాపోయింది. దీంతో భర్త,ఇద్దరు కొడుకులు కలిసి ఆమెను బాత్రూమ్లో నిర్బంధించారు. బయటకు వస్తానని ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఓ అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు పోలీస్ అధికారి రమునస్ మ్యాటోనిస్ తెలిపారు. ఆమె పట్ల ఎలాంటి దాడి,హింసకు పాల్పడలేదని, వైరస్ తమకు సోకుతుందేమోనన్న భయంతో ఆమెను నిర్బంధించారని చెప్పారు.