కరోనా దెబ్బకు మెంటలెక్కి నగ్నంగా వీధిలో, మెడ కొరికి నెత్తురుతాగి..!

Crime Published On : Saturday, March 28, 2020 04:16 PM

ఇండియాలో లాక్ డౌన్ ప్రకటన కంటే ముందే పొరుగుదేశం శ్రీలంకలో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడ జీవిస్తోన్న తమిళ వలసదారులంతా ఇంటిబాటపట్టారు. గతవారం లంక నుంచి ఓ వ్యక్తి(34) తమిళనాడులోని థేని జిల్లా కేంద్రంలోని తన ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. లక్షణాలు మైల్డ్ గా ఉండటంతో హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం డాక్టర్లు, ప్రభుత్వ సిబ్బంది వెళ్లి అతణ్ని పరీక్షించేవాళ్లు.

అయితే వారం రోజులు ఇంట్లోనే ఉండేసరికి. అతను మానసిక సమతుల్యం కోల్పోయి, ఉన్మాదిలా మారాడు. శుక్రవారం రాత్రి.. దుస్తులన్నీ విప్పేసి, నగ్నంగా వీధుల వెంట పరుగులు తీశాడు. జాంబీ సినిమాల్లో వైరస్ సోకినవాళ్లు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా.. ఓ ఇంటి ముందు వాకిట్లో నిద్ర పోతోన్న వృద్ధురాలి దగ్గరకెళ్లి.. అమాంతం పికకొరికి, నెత్తురుతాగే ప్రయత్నం చేశాడు. అలికిడి విని బయటికొచ్చిన స్థానికులు. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారే షాక్ కు గురయ్యారు. కర్రలు, తాళ్లతో ఆ ఉన్మాదిని బంధించి పోలీసులకు ఫోన్ చేశారు. ముసలమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.