రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య

Crime Published On : Friday, February 28, 2020 05:41 PM

కుక్కలు తీవ్రఅనారోగ్యానికి గురై తరువాత ఆ జబ్బు నయం కాదు అని నిర్ధారించుకున్న తరువాత వాటిని చంపడానికి ఉపయోగించే విషం (స్లోపాయిజన్), కొద్దిపాటి సైనెడ్ కలిపి కుటుంబ సభ్యుల తీసుకునే ఆహారంలో వేసి జాలీ థామస్ ఆరు హత్యలు చేసిందని వెలుగు చూసిందని ఈ కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి సీమెన్ మీడియాకు చెప్పారు. వరుస హత్యల కేసుల్లో 2019లో జాలీ థామస్ తో పాటు ఆమె రెండో భర్త షాజు, ఈమె సమీప బంధువులు మ్యాథ్యూ, ప్రాజికుమార్ లను అరెస్టు చేసి కోజికోడ్ జైలుకు తరలించారు.