భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బెదిరింపులు..
రాజస్తాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై భర్త ఎదుటే ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్పై వెళ్తున్న జంటను ఆపి భర్తపై తీవ్రంగా రాడ్స్తో దాడి చేసి ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఏప్రిల్ 26న రాజస్తాన్లోని అల్వార్ గ్రామానికి చెందిన ఓ జంట తల్వృక్ష గ్రామానికి బైక్పై మధ్యాహ్నం 3గంటల సమయంలో బయలుదేరారు వారు బైక్పై వెళ్తుండగా మార్గమధ్యలో ఐదుగురు దుండగులు అడ్డుపడ్డారు. అందులో ఇద్దరు ఆమె భర్తను కిందపడేసి విచక్షణారహితంగా దాడి చేశారు. అతనిపై దాడి చేస్తుండగానే మిగతా ముగ్గురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై మిగతా ఇద్దరు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతేకాదు, ఈ అఘాయిత్యం మొత్తాన్ని వీడియో తీసి బెదిరించారు. విషయం పోలీసుల దాకా వెళ్తే చంపేస్తామని ఆ జంటని హెచ్చరించారు. దీంతో మూడు, నాలుగు రోజుల పాటు తమలో తామే కుమిలిపోయిన ఆ దంపతులు.. ఎట్టకేలకు ధైర్యం చేసి ఏప్రిల్ 30న పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.