Breaking: ఘోర బస్సు ప్రమాదం

Crime Published On : Tuesday, June 17, 2025 11:08 AM

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. జహూ నుంచి మండి వెళ్తుండగా పత్రీఘాట్ లో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.